హైదరాబాద్, జనవరి 9: నేడు నగరానికి ఉపరాస్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.45 నిమిషాలకు చేరుకొని అక్కడినుంచి జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి చేరుకుంటారు.
ఈ సమయంలో బేగంపేట్, పంజాగుట్ట ఫ్లెఓవర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు, లేదా నిలిపి వేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ అంక్షలను పరిగణలోకి తీసుకుని వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహాకరించాలని సిటీ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్ తెలిపారు.