రిజర్వేషన్ల బిల్లుపై టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ సూచన..

SMTV Desk 2019-01-08 18:40:00  ebc 10 percent reservations, Lok Sabhatha,var Chand Gehlot, TRS, MPs

న్యూఢిల్లీ, జనవరి 8: నిన్న అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ఆ దిశగా ఈరోజు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పట్టిన ఈ బిల్లుపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏవిధంగా వ్యవహరించాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి దిశానిర్ధేశం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ముస్లిం, మైనార్టీ రిజర్వేషన్ల బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా ప్రధాని నరేంద్ర మోదీని కోరాలని సూచించారు. దాంతో ముస్లింలకు 12శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ల కొరకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు.