ఆరోసారి సీఎంగా గెలిచిన నితీష్ కుమార్

SMTV Desk 2017-07-28 13:00:02  bihar, cm nithishkumar, deputy sushilkumar media

పాట్నా, జూలై 28 : బీహార్ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి కోసమే ఎన్డీఏ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సీఎంగా ఆరో సారి ప్రమాణస్వీకారం చేసిన తరువాత మాట్లాడిన నితీష్ ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవడానికి ముందు అనేక కోణాల్లో ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మరో వైపు ఇప్పుడు కేంద్రంలో, బీహార్ లో ఒకే కూటమి ప్రభుత్వాలు ఉన్నందున రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగమంతం గా ముందుకు తీసుకేలేందుకు అవకాశం కలుగుతుందని ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రానున్న 40 నెలల్లో మరింత అభివృద్ధి పథంలో నపించేందుకు వీలు కలుగుతుందన్నారు.