న్యూఢిల్లీ, జూలై 28 : ఇటీవల బ్రాడ్ బ్యాండ్ సిస్టమ్లపై మాల్ వేర్ దాడులు జరగడంతో బీఎస్ఎన్ఎల్ తమ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులను డిఫాల్ట్ సిస్టమ్ పాస్వర్డులను వెంటనే మార్చుకోవాలని సూచించింది. ఒక్కసారి పాస్వర్డ్ను మార్చుకుంటే ఇక ఎలాంటి సమస్య ఉండదని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలియజేశారు. సుమారు 2 వేల బ్రాడ్ బ్యాండ్ మోడమ్స్పై ఈ మాల్ వేర్ ప్రభావం పడిందని, డిఫాల్ట్ పాస్వర్డ్ ‘అడ్మిన్’ను మార్చకపోవడం వల్లనే ఈ దాడులు జరిగాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.