హైదరాబాద్, జనవరి 6: నగరంలో పలు ప్రాంతాల్లో సబ్ స్టేషన్ ల వద్ద కొన్ని పనుల కారణంగా కృష్ణా మంచి నీటి సరఫరా ఉండదని జల మండలి ప్రకటించింది. కృష్ణా మంచినీటి సరఫరాలో 132/6.6 కెవి సబ్స్టేషన్ వద్ద సిటీ, పిటిల పనుల వాళ్ళ సరఫరా ను ఆపనున్నట్లు సమాచారం. కృష్ణా మొదటి దశలో భాగంగా మరమత్తుల కారణంగా జనవరి 8, 9 తేదీలలో రియాసత్నగర్, సంతోష్నగర్, విన§్ునగర్, సైదాబాద్, ఆస్మాన్ఘాడ్, చంచల్గూడ, యాకత్పుర, మలక్పేట, ముసారాంబాగ్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్మెట్, శివం, చిలకలగూడ, అలియాబాద్, మిరాలం, కిషన్బాగ్, సాహెబ్నగర్, బిఎన్రెడ్డి నగర్, బాలాపూర్, బార్కస్, మైసారం, బండ్లగూడ,మైలారదేవరపల్లి, శాస్త్రీపురం, బుద్వేల్, గొల్డెన్హైట్స్, సులేమానగర్, హైదర్గూడ, ఆల్లబండ, బొజగుట్ట, ఆసిఫ్నగర్, ఎలుగుట్ట, హబ్సిగూడ, నాచారం, తార్నాక, లాలాపేట, బౌద్దనగర్, మారెడ్పల్లి, మీర్పేట, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, ప్రశాసన్నగర్, మౌలాలి, హెచ్బికాలనీ, మల్లాపూర్, బోడుప్పల్, బీరప్పగూడ తదితర ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.