తమిళనాడులోని ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

SMTV Desk 2019-01-06 17:23:52  Tamilnadu, Pudukotte, Road accident, Ayyappa devotes

చెన్నై, జనవరి 6: తమిళనాడులోని పుడుకోట్టే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 10 మంది అక్కడిక్కక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారంత అయ్యప్ప భక్తులుగా అలాగే వారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారుగా భావిస్తున్నారు. హైద్రాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానిక పోలీసులు చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలోని పుద్దుకొట్టై వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణీస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయ్యప్ప భక్తులు ఎక్కడి వారనే విషయాన్ని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.