జగన్ కేసుపై రాష్ట్ర సర్కార్ తీవ్ర అనుమానాలు..!!

SMTV Desk 2019-01-06 17:04:41  TDP, YSRCP, YS Jagan mohan reddy, Attempt to muredr, Chandrababu, NIA, HIgh court, Central government

అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ కోడికత్తి దాడి కేసును తాజాగా ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని, ఈ కేసు విషయంలో కేంద్రం ఉత్సాహం చూపడాన్ని రాజకీయ కోణంగా చూడాలని ఏపీ సర్కార్ అభిప్రాయంతో ఉంది. జగన్‌పై దాడి కేసు విషయమై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా విచారణ జరుపుతున్న సమయంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజులుగా పోలీసు అధికారులతో పాటు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ విషయమై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు సర్కార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై న్యాయ పోరాటం చేయాలని బాబు భావిస్తున్నారు.

అయితే ఈ కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేయాలా హైకోర్టులో దాఖలు చేయాలా ఏఏ అంశాలను ప్రస్తావించాలి ఈ కేసు విషయంలో కేంద్రం ఎందుకు అతిగా స్పందిస్తోందనే విషయాన్ని బట్టబయలు చేయాలని టీడీపీ భావిస్తోంది. జగన్‌‌ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం రాజకీయపరంగా తీసుకొన్న నిర్ణయంగానే టీడీపీ భావిస్తోంది. ఈ విషయమై హైకోర్టులో సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడు రెండు రోజులుగా ఆయా జన్మభూమి సభల్లో కూడ ప్రస్తావిస్తున్నారు.