హైదరాబాద్, జనవరి 5: శనివారం ఓయూలో విసి రామచంద్రం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ కోర్సులలో పిహెచ్డి, పిజిలు పూర్తి చేసిన విద్యార్ధులు తమ హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. నాన్ బోర్డర్స్ హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని కొర్సులకు ఆన్లైన్ మూల్యాంకనం వర్తింపజేస్తామన్నారు. రికార్డ్స్ అన్నింటినీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పిన విస ఈ ఏడాది నుంచి ఓయూసెట్ను ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పారు. రీసెర్చ్, ఇన్నోవేషన్ను మరింత ప్రొత్సహిస్తున్నామని ప్రకటించారు. పలు నూతన భవనాలు నిర్మిస్తున్నామని విసి తెలిపారు.