ముంబై, జనవరి 5: ఈరోజు ముంబైలోని ఓ కోర్టు లిక్కర్ కింగ్, బ్యాంకు రుణాల ఎగవేతదారుడైన విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. విజయ్ మాల్యా రుణాలపై విచారన చేపట్టిన కోర్టు ఆర్థిక నేరస్థుల చట్టం 2018 సెక్షన్ 2ఎఫ్ ప్రకారం అతడిని ఆర్థిక నేరస్థుడిగా గుర్తించింది. ఈ మేరకు ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు శనివారం తీర్పును వెలువరించింది. ఈడీ( ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విజ్ఞప్తి మేరకు మనీలాండరింగ్ కోర్టు మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
భారత దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి మాల్యా 9వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుని, కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరిగే వారిని కోర్టు ఆర్థిక నేరస్తులుగా గుర్తిస్తుంది. కాగా కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత రుణాల ఎగవేతదారుగా ప్రకటించడిన మొదటి వ్యక్తి మాల్యానే కావడం విశేషం.