తిరుపతి, జూలై 28: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిర్లంపూడి గ్రామం ప్రజలు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నారా లేక ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో అర్ధం కావట్లేదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని, వారికి అన్యాయం జరిగితే ఉద్యమించే ప్రజలపై ఉక్కుపాదం మోపడం సబబు కాదన్నారు. మీరు ప్రజలందరి ఓట్లతో గెలిచారు కాబట్టి వారి వాగ్దానాలను గుర్తించి, వారి కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీపై ఉందని ఆమె ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. వెంటనే ముద్రగడ పాదయాత్రకు అవకాశం కల్పించాలని, పోలీసుల రాజ్యంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదన్నారు.