న్యూఢిల్లీ, జనవరి 5: రానున్నలోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపక వొప్పందంపై ఎస్పీ అదినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మరింత చేరువయ్యారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిపై తుది చర్చలు జరిపేందుకు మాయావతితో అఖిలేశ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశ్యమైయ్యారు. దీనిపై ఇరు పార్టీల నుంచీ అధికారిక ప్రకటనేదీ రాలేదు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ సీట్లుండగా ఈ ఇరు పార్టీలు చెరో 37 స్థానాల్లో పోటీ చేసి, మిగిలిన 6 సీట్లను కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్దళ్ వంటి పార్టీలకు వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్కు అమేథీ, రాయ్బరేలీ సీట్లు ఇచ్చే చాన్సుంది.