నరసరావుపేట, జనవరి 5: ప్రాంత న్యాయస్థానంలో ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐశ్వర్య (25)ఈ రోజు ఉదయం హఠాన్మరణం చెందారు. అమె మరణ వార్త తెలియటంతో న్యాయవాదులు కోర్టు ప్రాంగణానికి తరలివస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన కోర్టు బంగళాలో తల్లిదండ్రులతో కలిసి ఐశ్వర్య నివసిస్తున్నారు. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు. శుక్రవారం ప్రమాదవశాత్తూ ఆమె ఇంటిలో జారిపడటంతో అస్వస్థతకు గురవ్వడం వల్ల శుక్రవారం కోర్టుకు కుడా సెలవు పెట్టారని సమాచారం.
అయితే ఈ రోజు ఉదయం తన తల్లికి కాఫీ తయారు చేస్తుండగా వొక్కసారిగా ఐశ్వర్య కుప్పకూలిపోయారు. దీంతో కోర్టు ఆవరణంలోని సిబ్బంది ఆమెను హుటాహుటిన అంబులెన్స్ ద్వారా పట్టణంలోని మహాత్మాగాంధీ హాస్పిటల్ కు తరలించగా డాక్టర్ పరీక్షించి ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. దీంతో నరసరావు పేట న్యాయవాదులు ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేపోతున్నారు.