మోదీ రాక అదృష్టమని ప్రశంసించిన వెంకయ్య

SMTV Desk 2017-07-28 11:24:25  venkayya naydu in hyderaabad meeting,

హైదరాబాద్, జూలై 28 : హైదరాబాద్ మాదాపూర్ లో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా ఉపముఖ్యమంత్రిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన వెంకయ్యను నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. "మోదీ లాంటి నాయకుడు రావడం ఈ దేశం చేసుకున్న అదృష్టం అని, ప్రధానితో కలిసి పనిచేసే అవకాశం లేకపోవడం బాధకరంగా ఉందని. 2019 వరకు ప్రధానిగా మోదీనే కావాలని దేశమంతా కోరుకుంటుంది", అంటూ ప్రసంగించారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని, సీఎల్పీ నేత జానా రెడ్డి, బీజేపి నేతలు కిషన్ రెడ్డి, లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.