న్యూఢిల్లీ, జనవరి 4: ఈరోజు పార్లమెంట్ లో రఫేల్పై చర్చ జరుగుతున్న క్రమంలో, పార్లమెంట్ వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడుతూ రఫేల్పై చర్చ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పారిపోతున్నారని మండిపడ్డారు. ఈ వొప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. రఫేల్పై తాము లేవనెత్తిన అంశాలన్నింటికీ నిర్మలా సీతారామన్ బదులివ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు.
అనిల్ అంబానీ సంస్థకు రఫేల్ వొప్పందంలో భాగస్వామ్యం కల్పించింది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రఫేల్ డీల్ అంతా ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో జరిగిందని అన్నారు. అనిల్ అంబానీ కంపెనీని రఫేల్ వొప్పందంలో భాగస్వామిగా చేర్చాలని ప్రధాని మోదీ సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ వెల్లడించారన్నారు.