మాజీ మంత్రి కుమారుడిపై కాల్పులు

SMTV Desk 2017-07-28 10:09:38  mukesh goud son muder mistry, vikram goud

హైదరాబాద్, జూలై 28 : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పై కాల్పులు జరిగాయి. ఫిలింనగర్‌ రోడ్‌ నంబర్‌ 86లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా విక్రం గౌడ్ తెల్లవారుజామున 3 గంట‌ల‌ స‌మ‌యంలో ఆలయంలో పూజ కోసం ఇంటి బ‌య‌ట‌కు రాగా గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతడి శరీరంలోకి రెండు బుల్లెట్స్ దూసుకెళ్లినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న అతని కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడివున్న విక్రం గౌడ్ ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిల‌క‌డ‌గా ఉందని.. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.