పవన్ మాతో కలుస్తారో లేదా పోరాటం చేస్తారో ఆయన ఇష్టం : ఏపీ సీఎం

SMTV Desk 2019-01-03 21:08:37  Pawan kalyan, Chandrababu, TDP, Janasena

గుంటూరు, జనవరి 3: ఏపీ సీఎం చంద్రబాబు జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు మరో సారి సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. గురువారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం కేంద్రంపై పోరాటంలో పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా లేదా పోరాటం చేస్తారో ఆయన ఇష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా 72 వేల కోట్లు రాష్ట్రానికి కేంద్రం నుండి రావాలని ఫైనల్ చేసినట్టు చెప్పారు. విభజన చట్టం ద్వారా ఏపీకి న్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సినీ నటుడు శివాజీ చెప్పినట్టుగా చుక్కల భూముల విషయంలో ఐఎఎస్ అధికారులు వ్యవహరిస్తే దానికి సంబంధించిన ఆధారాలను ఇవ్వవాలని బాబు శివాజీని కోరారు. పోలవరంపై ఇప్పటికే 350 పేజీల రిపోర్ట్‌ను కేంద్రానికి పంపించినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. మహాకూటమి ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తున్నాయని ఆయన చంద్రబాబునాయుడు అన్నారు.