మురళి హత్యతో రాజేందర్‌ కు సంబంధం లేదు : ఉత్తమ్‌ కుమార్

SMTV Desk 2017-07-27 18:59:54  PCC CHEEF UTHHAM KUMAAR REDDY, KAARPORETER MURALI MUDRDER MISTRY

వరంగల్, జూలై 27 : ఇటీవల వరంగల్ లో హత్యకు గురై సంచలనం సృష్టించిన కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యతో ఎలాంటి సంబంధం లేకున్నా, కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్‌రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టినట్లు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ లో కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేధించడం సరికాదన్నారు. అంతేకాకుండా బీసీలు, దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా 31న జరిగే సిరిసిల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సభకు మాజీ డిప్యూటీ స్పీకర్ మీరాకుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు.