కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల నియామకం....

SMTV Desk 2019-01-03 16:23:43  Congress party, DCC Posts, Uttam kumar reddy, Telangana

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయ పాలైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామాకాన్ని చేపట్టనుంది.వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమర్థులైన వారికి ఈ భాద్యతలను అప్పగించాలని భావిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఢీల్లీకి పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.ఈ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ గురువారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు.

పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జీలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చర్చించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించనున్నారు. మూడు రోజుల పాటు వరుసగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన కొత్త నాయకత్వాన్ని జిల్లాల్లో తీసుకోనున్నారు. డీసీసీ అధ్యక్షుల ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే పీసీసీ ప్రక్షాళన పూర్తి చేయనున్నారు.