ముస్లింలను కించపరిచేలా మాట్లాడిన వైసీపీ నేత

SMTV Desk 2019-01-03 12:42:35  YSRCP, Goutam reddy, Muslims, YS Jagan mohan reddy

విజయవాడ, జనవరి 3: వైసీపీ ముస్లింలకు ఎంత మద్దతు ఇస్తుందో అందరికి తెలిసిన విషయమే. అలాంటి పార్టీలో ఉండి ముస్లింలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు వైసీపీ కీలక నేత. విజయవాడకు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఓ ప్రముఖ టీవీ చానెల్ లో ముస్లింలను కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనపై వేటు వేసేందుకు అధిష్టానం సిద్ధమౌతోందని తెలుస్తోంది.

గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అధినేత జగన్‌ ఆదేశాల మేరకు ఈ అంశంపై విచారణ జరిపిన క్రమశిక్షణ సంఘం గౌతమ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని వైసీపీ క్రమశిక్షణ సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆయన నుంచి సంజాయిషీ అందగానే సస్పెన్షన్‌ వేటు వేసేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమవుతోంది.