టీడీపీ : పవన్ తో దోస్తీ...!!! జగన్ తో పోటీ...???

SMTV Desk 2019-01-03 12:29:55  TDP, Janasena, YSRCP, Chandrababu, Pawan kalyan, YS Jagan mohan reddy, Assembly elections

అమరావతి, జనవరి 3: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొంత కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న నెపంలో చంద్రబాబు రూటు మార్చినట్టు తెలుస్తుంది. ఇది వరకు చంద్రబాబు ఎక్కడ మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాన్ ని ద్వేశించేవారు కాని ఇప్పుడు ఊహించని విధంగా పవన్ కు ఫుల్ సపోర్ట్ అన్నట్టు సంకేతాలు ఇస్తూ మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. తాజాగా మోడీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు చంద్రబాబు. అయితే పవన్ పై బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.

ఇదిలా వుండగా బాబు వ్యాఖ్యలపై పవన్ మాత్రం ఏ మాత్రం స్పందించక పోవడం ఈ ఊహాగానాల్ని నిజం చేసేలా వున్నాయి. అయితే దీన్ని బట్టి చూస్తె రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తో జనసేన కలిసి పోటీ చేస్తుంది అని పలు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రజలు మాత్రం వీటిపై చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని మరోసారి నిజం చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారా అని అలాగే పవన్ కళ్యాణ్ పై దోస్తీకి చంద్రబాబు చేతులు చాపుతున్నారని అందుకే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి దూరం చేసుకునే కన్నా విమర్శల దాడిని తగ్గించి దరి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో చిత్తూరులో పవన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

అంతేకాక రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందని దానిపైపోరాటం చేసేందుకు తనతో కలిసి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ గాలి పీల్చారు, నీరు తాగారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి తమతో సహకరించాలని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఏకమయ్యారని విమర్శించారు. ముగ్గురు ఏకమై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే కేసీఆర్ కు ఇబ్బంది కలుగుతుందని అందుకే అడ్డుకుంటున్నారని తెలిపారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యానించేవారు. అయితే కుప్పం నియోజకవర్గం వడ్డిపల్లి జన్మభూమి కార్యక్రమంలో విమర్శలు చెయ్యకపోవడం వెనుక పవన్ తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగేవారు. మోదీకి జగన్ దొంగ పుత్రుడు అయితే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ ఘాటుగా విమర్శించేవారు అలాంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చెయ్యకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం జగన్ టార్గెట్ గా విమర్శలు సంధించారు. జనసేనపై చంద్రబాబు విమర్శలు చెయ్యకుండా ఆచితూచిగా వ్యవహరిస్తూ సహకరించాలి అంటూ మాట్లాడటం వెనుక అసలు విషయం వేరే ఉందని అంతా గుసగుసలు ఆడుకుంటున్నారు. భవిష్యత్ తో పవన్ కళ్యాణ్ తో పొత్తుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు తాను పవన్ తో కలిసి పోటీ చేస్తే జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటగూ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా అనిపిస్తోంది.