పార్లమెంట్ సభ్యులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు

SMTV Desk 2019-01-02 20:47:42  Parliment, Venkaiah nayudu, Members of Parliament

న్యూఢిల్లీ, జనవరి 2: పార్లమెంట్ సభ్యులపై ఉపరాస్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక అంశాలపై చర్చలు జరగకుండా సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఉభయసభలు పలు అంశాలపై చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంతో ఆయన ఈరోజు రాజ్యసభలో మాట్లాడారు. మరో ఐదు రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగియబోతున్నాయి. కానీ సభలో దేని కోసం చర్చ జరగకుండానే వాయిదాల పర్వం కొనసాగుతుందని ఆయన ఆసంతృప్తి వ్యక్తం చేశారు.