న్యూఢిల్లీ, జనవరి 2: నెల క్రితం ఆన్లైన్లో ఔషధాలను అమ్మకాలను నిషేధించాలని ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాజాగా మద్రాస్ హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం నిలుపుదల ఉత్తర్వులు (స్టే) ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గ దర్శకాలు రూపొందించేవరకూ స్టే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ-ఫార్మా సంస్థలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ఎం. సత్యనారాయణన్, జస్టిస్ పి.రాజమాణిక్యంతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.