న్యూఢిల్లీ, జనవరి 2: నేడు పార్లమెంట్లో భారత ప్రధాని మోడీ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మోడి పై మండిపడ్డారు. రఫేల్ పై మాట్లాడేందుకు మోడికి ధైర్యం లేదని, అందుకే తన గదిలో ఉండిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. గతంలో కూడా ఈ అంశంపై మోడి ఐదు నిమిషాలే స్పందించారని రాహుల్ వ్యాఖ్యానించారు. రఫేల్ జెట్ వొప్పందానికి సంబంధించిన పత్రాలు అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారికర్ బెడ్ రూంలో ఉన్నాయన్న గోవా మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులను సభలో వినిపించాలని రాహుల్ పట్టుబట్టారు. ఆడియో టేపులు ఉన్నట్లు మీరు నమ్ముతున్నారా..? అని స్పీకర్ సుమిత్రా మహాజన్ రాహుల్ను ప్రశ్నించారు. మరోవైపు అరుణ్ జైట్లీ సైతం ఆడియో టేపులు నిజమని నిరూపించగలరా? అని సవాలు విసిరారు.