అన్నా డీఎంకే ఎంపీలు సస్పెండ్

SMTV Desk 2019-01-02 20:31:22  All India Anna Dravida Munnetra Kazhagam Party, Lok sabha, Speaker, Sumitra mahajan, MP Suspensions

న్యూఢిల్లీ, జనవరి 2: అన్నా డీఎంకే ఎంపీల పై లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ కఠన చర్యలు తీసుకొని సస్పెండ్ చేశారు. సభ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నందుకు వరుసగా ఐదు రోజులపాటు లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన 26 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.కావేరీ నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టనునిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నా డీఎంకే ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభ వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేశారు. తమను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ నేత తంబిదురై మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నాయని, కర్ణాటకలో కొన్ని సీట్లు గెలవాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే మేకదాటు ఆనకట్ట నిర్మాణానికి అనుమతించారని ఆరోపించారు. నిరసన తెలియజేయడం తమకుగల ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.