శ్రీనగర్, జనవరి 2: కశ్మీర్ లోని సరిహద్దు రేఖ వద్ద పాకిస్తాన్ రేంజర్ల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్వోసీని ఆనుకొని ఉన్న భారత సైనిక పోస్టులపై ఈరోజు ఉదయం కాల్పులకు తెగబడింది. పూంచ్ సెక్టార్లోని వరుసగా రెండోరోజు పాక్ సైన్యం కాల్పుల విరమణ వొప్పందాన్ని ఉల్లంఘీంచింది. అయితే మందుగానే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు పాకిస్తాన్కు ధీటుగా సమాధానం చెప్పినట్లు ఆర్మీ వెల్లడించింది. అంతేకాక ఎల్వోసీ సమీపంలోని బాగ్ సెక్టార్ వద్ద భారత్కు చెందిన ఓ డ్రోన్ను కూల్చివేశామంటూ పాక్ చేస్తున్న ఆరోపణలను భారత ఆర్మీ కొట్టిపారేసింది.