న్యూ ఢిల్లీ, జనవరి 2: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ రఫెల్ యుద్ధవిమానాల వొప్పందంలో క్లీన్ చిట్ ఇస్తూ ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. రఫెల్ వొప్పందంపై కేంద్రం తప్పుడు వివరాలను న్యాయస్థానానికి సమర్పించిందని వీరు తమ పిటిషన్లో పేర్కొన్నారు.