హైదరాబాద్, జనవరి 2: ఉమ్మడి హై కోర్ట్ విభజన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల వల్లే సాధ్యమైందని తెరాస తాజా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి హై కోర్ట్ సాదించామని చెప్పుకొచ్చారు.
రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు సాధించేందుకు కృషి చేసిన న్యాయవాదులకు ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీన తెలంగాణలో న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ గా నియమితులైన భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ కి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
Finally, Telangana state gets its own High Court due to tenacious efforts of our Hon’ble CM KCR Garu & respected Members of Parliament👏
— KTR (@KTRBRS) January 2, 2019
Congratulations to the Lawyers & other judicial staff who’ve fought hard. Welcome Justice Radhakrishnan Ji, the first CJ of Telangana HC 💐 pic.twitter.com/CQL2q1IrSj