కాంగ్రెస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మాయావతి ...!!!

SMTV Desk 2019-01-01 13:22:45  Mayawati,UP,congress,INC,Alliance

ఉత్తర్ ప్రదేశ్, జనవరి 1:రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని... గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా అక్కడి దళితులపై నమోదైన కేసులను ఎత్తి వేయాలని ఎత్తి వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు,లేని యెడల కాంగ్రెస్ పార్టీ కి ఇచ్చే మద్దతుపై తాము పునరాలోచిస్తామని హెచ్చరించారు. ఏ వొక్క హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని... బీజేపీ మాదిరే కాంగ్రెస్ వ్యవహరించరాదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని మాయావతి చెప్పారు.
హామీలను ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీలను వొకే నాణేనికి రెండు వైపులుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ మరకను తొలగించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందని చెప్పారు.