న్యూ ఢిల్లీ, డిసెంబర్ 31: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును ఇటీవల లోక్సభలో ఆమోదించుకొన్న సంగతి తెలిసిందే. నేడు ఈ బిల్లు ని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడానికి సిద్దం అవుతోంది భాజపా . కానీ దానిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యసభలో తమకు తగినంత బలం లేకపోయినప్పటికీ జిమ్మిక్కులు చేసైనా ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకోబోతున్నామని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్, బిజెపిలు రెండూ తమ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేశాయి. కీలకమైన ఈ బిల్లు చర్చ, ఓటింగ్ సందర్భంగా సభ్యులందరూ విధిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. కనుక నేడు రాజ్యసభ సమావేశం ఆసక్తికరంగా సాగనుంది.