అమరావతి, డిసెంబర్ 31: ‘f2 ఆడియో విడుదల వేడుక వైజాగ్లో ఆర్కే బీచ్ ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి గంటా శ్రీనివాస రావు హాజరయ్యారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్, వరుణ్తేజ్, దేవిశ్రీ ప్రసాద్, దిల్రాజు వేదికపై సినిమాలోని పాటలకు స్టెప్పులేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ‘వైజాగ్తో అనేక మధురజ్ఞాపకాలు ఉన్నాయని ఇక్కడే ‘స్వర్ణకమలం , ‘సుందరకాండ , ‘గురు తీశామని ఇదే బీచ్లో ‘మల్లీశ్వరి సినిమాలో కత్రినాకైఫ్తో కలిసి అలా నడిచాను అని ఆయన చెప్పారు. ఇక 'f2' సినిమా విషయానికి వస్తే వినోదభరితంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మా భార్యలు తమన్నా, మెహరీన్ రాలేదు (నవ్వుతూ). సినిమా లో హీరోయిన్స్ అన్నమాట. సంక్రాంతికి చిత్రం విడుదల కాబోతోంది అని ఏ సందర్బంగా తెలిపారు. సంక్రాంతి సీజన్లో తమ సినిమాతో పాటు వస్తున్న బాలయ్య, చరణ్, రజనీల సినిమా లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మన తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలి అని ,వైజాగ్కు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడే నేను నటన నేర్చుకున్నా. కాబట్టి నా హృదయానికి ఈ ప్రాంతం చాలా దగ్గర అని వరుణ్తేజ్ చెప్పారు . ఇంకా ఆయన మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు గారు మా కుటుంబానికి ఆప్తులు. ఏ కార్యక్రమం అయినా పిలవగానే వస్తుంటారు. ఆయనకు నా ధన్యవాదాలు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ తన తో తొలిసారి పనిచేయడం ఇంకా ఏ జర్నీ అలా కంటిన్యూ చేయాలనీ వుంది వెంకటేష్తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఆయనతో ప్రయాణం బాగా జరిగింది అని వరుణ్ తేజ్ ముగించారు. ఈ మల్టీస్టారర్కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.