హైదరాబాదును డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తాం : మంత్రి పద్మారావు

SMTV Desk 2017-07-27 17:04:10  DRUGS FREE CITY, EXISE MINISTER PADMAARAAO.

హైదరాబాద్, జూలై 27 : డ్రగ్స్ గురించి విచారణ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈ నెల 30 న కేబీఆర్ పార్కులో నిర్వహించనున్న యాంటి డ్రగ్స్ ప్రోగ్రాం కు రావలసిందిగా పద్మారావును ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్ ఆహ్వానించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.