కేసీఆర్ ‘ఆక్స్ ఫర్డ్’ లో చదువుకున్నట్టు మాట్లాడుతున్నాడు: చంద్రబాబు

SMTV Desk 2018-12-30 16:18:24  Chandrababu, KCR, Press Meet

అమరావతి, డిసెంబర్ 30: నాకు ఇంగ్లీష్ భాష రానట్టు.. కేసీఆర్ కు ఏదో బాగా వచ్చని, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుని వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ఆయన ఈరోజు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నాతో ‘జై తెలంగాణ అనిపించానని అంటున్నాడు. ఆయన అనిపించడమేంటి? తెలంగాణతో నేనెప్పుడు విభేదించాను? ఆరోజున రాష్ట్రం కోసం సంపద సృష్టించాను. విభజన కారణంగా ఆ సంపద ఇంకో రాష్ట్రానికి పోయినప్పుడు చాలా మంది నన్ను‘మీకు బాధగా ఉందా? అని అడిగారు. ‘నా కెప్పుడూ బాధ లేదు. తెలుగు జాతి కోసం సంపద సృష్టించాను అని చెప్పను.

దేవుడు నాకు ఇంకా శక్తిని ఇచ్చాడు. హైదరాబాద్ కు ఈక్వల్ గా అమరావతిని అభివృద్ధి చేస్తాను అని చెప్పాను. నరేంద్ర మోదీ పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఏం చేశారు? అని విమర్శిచారు. అహ్మదాబాద్ లో ఏముంది? వొక్క ఐటీని ప్రమోట్ చేయలేక పోయారు. నాలెడ్జి ఎకానమీ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో వొక్క నాలుగేళ్లలోనే ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతోంది. హార్డ్ వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. వీళ్లు నన్ను ఇబ్బంది పెట్టి ఎట్టి పరిస్థితిలో అమరావతి రాకుండా ఉండాలని ప్రయత్నం చేశారు. ఈరోజున వారు డబ్బులు ఇవ్వకపోయినా అమరావతి రియాల్టీ అవుతుంది. వాళ్లకు అసూయ. ప్రధానమంత్రి మన మీద చాలా కక్ష గట్టారు అని బాబు విమర్శించారు.