పవన్ కల్యాణ్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు..

SMTV Desk 2018-12-30 13:03:12  Pavan kalyan, Janasena, CM, AP

విజయవాడ, డిసెంబర్ 30: జనసేనాని పవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలంటూ జనసేన శ్రేణులు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడకు చెందిన నేతలు, కార్యకర్తలు ఈరోజు తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు ఏపీలో రోజురోజుకూ ఆదరాభిమానాలు పెరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే మరింత మంది నేతలు జనసేనలో చేరుతారని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పవన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.