న్యూఢిల్లీ, జూలై 27: రోజురోజుకు పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల్ కొనుగోళ్ల దృష్ట్యా తక్కువ ధరలో చైనాకు చెందిన మొబైల్స్ కంపెనీ ఐవోమీ కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఐవోమీ-మి4 అనే ఈ ఫోన్ లో 4జీ వీవోఎల్టీఈ సదుపాయంతో వస్తుంది. ఈ ఫోన్ను ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో రూ.3,499లకే అందుబాటులో ఉంచారు. 4.55 ఇంచ్ డిస్ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యంతో, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్ట్ంతో పనిచేస్తుంది. 5 మెగాపిక్సల్ ముందు, వెనుక కెమెరాలను కూడా కలిగి ఉంది.