నలుగురు ఉగ్రవాదుల హతం...

SMTV Desk 2018-12-29 13:21:39  Jammu kashmir, Terrorists, Pulvama, Boarder security force, Army

జమ్మూకశ్మీర్, డిసెంబర్ 29: రాష్ట్రంలోని పుల్వామా జిల్లా రాజ్ పురా పట్టణంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాదులను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా బలగాలు గుర్తించాయి. ఘటనాస్థలి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు రాజ్ పురా పట్టణంలో తల దాచుకున్నారన్న పక్కా సమాచారంతోనే బలగాలు అక్కడ కూంబింగ్ నిర్వహించాయి.