మణికంఠ కిడ్నాప్ మిస్టరీ చేధించిన పోలీసులు

SMTV Desk 2017-07-27 16:05:27  kidnap, case, police, chejing, manikanta

విశాఖపట్నం, జూలై 27 : ఇటీవల మణికంఠ అనే యువకుడు కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ కేసులో గోపాలపట్నం పోలీసులు మిస్టరీని ఛేదించారు. దర్యాప్తులో బయటపడ్డ విషయాలతో పోలీసులు షాక్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ డ్రామా ఆడింది మణికంఠనేనని పోలీసులు గుర్తించారు. గాజువాకలో ఒక హోటల్ లో ఉండి ఈ కిడ్నాప్ డ్రామాను మణికంఠ, అతని స్నేహితులతో కలిసి ఆడారని తెలిపారు. ఇందులో భాగంగానే మణికంఠ అతని తల్లిదండ్రులకు ఫోన్ చేయించి రూ. 15 లక్షలు డిమాండ్ చేయించాడు. ఈ మిస్టరీని ఛేదించిన పోలీసులు మణికంఠతో పాటు అతని నలుగురు స్నేహితులను అరెస్టు చేసామని పోలీసులు వెల్లడించారు.