హైదరాబాద్, డిసెంబర్ 29: నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా 9 రోజుల పాటు ప్లాట్ఫారం టికెట్ ధరలను 10 నుంచి 20 రూపాయిలకు పెంచుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు. జనవరి 9 నుంచి 17వ తేదీ వరకు ప్లాట్ఫారం టికెట్ ధరలు పెంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.