ఆరో శ్వేతపత్రం విడుదల

SMTV Desk 2018-12-28 15:39:28  AP, CM, Chandrababu, Amaravaati, Release White papers, Education, Medical

అమరావతి, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అమరావతిలోని ప్రజావేదికలో మరో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విద్య, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం అంశాలపై ఆరో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్య, రంగాల్లో అమలు చేసిన పథకాలను, సంస్కరణలు, ఆవిష్కరణలను వివరించారు. అన్ని జూనియర్‌ కళాశాలలకు వైపై అనుసంధానం చేశామని , పాఠశాలల్లో యోగా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో నాలెడ్జ్‌ మిషన్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే నైపుణ్యాభివృద్ధిలో ముందుకెళ్తున్నామన్నారు. ప్రపంచంలోని ఉత్తమ వర్సిటీలను ఇక్కడికి తీసుకురావాలని కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు చదువుకుంటున్న సమయంలోనే ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు.