న్యూ ఢిల్లీ, డిసెంబర్ 28: ఢిల్లీ లో టీఆరెస్ పార్టీ భవనాన్ని నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ పార్టీ కార్యాలయ నిర్మాణానికి అనువైన ప్రదేశం కోసం ఢిల్లీ లో టీఆరెస్ పార్టీ ఎంపీలు ఈ రోజు స్థలాలను పరీశీలించనున్నారు. ఎంపిలతో పాటు ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా ఉండనున్నారు. అయితే ఎంపీలు స్థలాలను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం కెసిఆర్ అందులో వొక స్ధలాన్ని ఎంచుకోనున్నారు. వెయ్యి గజాల స్థలం కేటాయించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత శంకుస్థాపన చేసి.. రెండు మూడు నెలల్లోనే కార్యాలయాన్ని పూర్తి చేయనున్నారు.