న్యూ ఢిల్లీ, డిసెంబర్ 27: పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లుపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన చర్చల అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ బిల్లు పై అసదుద్దీన్ ఓవైసీ ఏవైతే సవరణలు చేశాడో అవి వీగిపోయాయి. ఈ బిల్లుకు అనుకూలంగా సభలో 245 మంది వోట్ వెయ్యగా, కాగా 11 మంది సభ్యులు వ్యతిరేఖంగా వోట్ వేశారు.