హైదరాబాద్, డిసెంబర్ 27: ఈ టీవి గ్రూప్ మరో కొత్త సేవలను ప్రారంభించింది. ఈటివీ గ్రూపునకు చెందిన నాలుగు ఛానళ్ల హెచ్డీ సేవలను రామోజీ గ్రూపు సంస్థల ఛెర్మన్ రామోజీరావు లాంఛనంగా ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్సిటిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటివీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ ఛానళ్లు హెచ్డీ సేవలను స్విచ్ ఆన్ చేసి ప్రసారాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్సిటి ఎండీ రామ్మోహన్రావు,ఫిల్మ్సిటీ, డాల్ఫిన్ హోటల్స్ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ సీఈవో బాపినీడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానళ్లను హెచ్డీలో వీక్షించేందుకు స్థానిక కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్ని సంప్రదించాల్సి ఉంటుంది.