సంక్రాంతి బరిలో 'పెట్టా'.!

SMTV Desk 2018-12-27 15:17:04  Rajinikanth, Petta, Sankranthi Realese

హైదరాబాద్, డిసెంబర్ 27: సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'పెట్టా' చిత్రం రూపొందింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన ఇద్దరు కథానాయికలు సిమ్రాన్, త్రిష నటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు.

సంక్రాంతికి తెలుగులో ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, పెట్టా కి థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించారు. ఈ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కానీ సంక్రాంతికే ఈ సినిమాను బరిలోకి దింపాలనే నిర్మాత పట్టుదలతో ఆ దిశగా పనులు జరుగుతున్నాయట. గతంలో బాషా సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ఈ సినిమాను రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. రజనీ ఆ స్థాయి విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి మరి.