మహేశ్ ని ఒప్పించే పనిలో సుకుమార్ ..!

SMTV Desk 2018-12-27 13:27:04  Mahesh babu, Maharshi, Sukumar, New Script

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళతాడనే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబుకి సుకుమార్ వొక లైన్ వినిపిస్తే ఆ స్టోరీ తనకి సరిపడదని చెప్పాడట. దాంతో మరో కొత్త కథ వినిపిస్తే అది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదని అన్నాడట. మహేశ్ బాబును సాధ్యమైనంత త్వరగా వొప్పించవలసిన అవసరం ఉందని తెలుసుకున్న సుకుమార్, అదే పనిలో వున్నాడని సమాచారం.ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమా షూటింగు పూర్తయ్యేలోగా సుకుమార్ వొప్పించలేకపోతే, మరో దర్శకుడికి మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.