హైదరాబాద్, డిసెంబర్ 27: టిఆర్ఎస్ ఎంపీ బి. వినోద్కుమార్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుదవారం మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయనీ మండిపడ్డారు. ఏ రోజు టిఆర్ఎస్ పార్టీ బిజెపికి మద్దతు తెలుపలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపిలు గత 60 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని ఆ పాలనలో ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు అవకాశం ఇవ్వలేదన్నారు. అందుకే ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా సిఎం కేసిఆర్ శ్రమిస్తున్నారని వినోద్ పేర్కొన్నారు.
కాగా ప్రధాని నరేంద్రమోడీతో బుధవారం సాయంత్రం సిఎం కేసిఆర్ సమావేశం కావడం రాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధానిని కలవడం అనవాయితీ అని ఆయన వివరించారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై సిఎం కేసిఆర్ ప్రధానితో చర్చించారన్నారు.