హైదరాబాద్, డిసెంబర్ 27: బుదవారం ఢిల్లీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయి సుమారు గంటన్నర పాటు సాగిన అనంతరం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదికి కేసీఆర్ 16 అంశాలపై వినతి పత్రం సమర్పించారు. ఈ పర్యటన పూర్తి చేసుకున్న కెసిఆర్ నేడు తిరిగి హైదరాబాద్ కి రానున్నారు.
రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెసిఆర్ తొలిసారిగా ప్రధానిని కలుసుకున్నారు.