హైదరాబాద్, జూలై 27 : హైదరాబాద్ కాచిగూడ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గుండెపోటుకు గురయ్యారు. వివరాలలోకి వెళితే.. ఏఎస్ఐ సుందర్ పోలీస్స్టేషన్లో గుండెపోటుకు గురికాగా, ఇది గమనించిన సహ సిబ్బంది వెంటనే ఆయనను నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కాగా గత కొంతకాలంగా సీఐ తన భార్యకు అనారోగ్యం కారణంతో విధులకు ఆలస్యంగా హాజరవుతున్నారు. దీనిని అదునుగా తీసుకున్న సీఐ తనపై తీవ్ర వేధింపులకు పాల్పడేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ వేధింపుల కారణంగానే తాను గుండెపోటుకు గురైనట్లు సుందర్ చెబుతున్నారు. తనను ఈ స్థితికి తీసుకువచ్చిన సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం జరిగేలా చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.