ఢిల్లీ లో వైఎస్‌ఆర్‌సిపి గర్జన దీక్ష

SMTV Desk 2018-12-26 19:09:43  YSRCP, Party leaders, New delhi, Jantarmantar

అమరావతి, డిసెంబర్ 26: ఈ నెల 27న ఢిల్లీ లో వైఎస్‌ఆర్‌సిపి నేతల గర్జన దీక్షను నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ దీక్షను చేపట్టనున్నామని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైఎస్‌ఆర్‌సిపి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద డిసెంబరు 27న ఉదయం 10గంటల నుంచి 4గంటల వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపిలు, పార్తీ నేతలు హాజరు కానున్నారు. కాగా విభజన హామీలు, ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీ పెద్ద పెత్తున ఉద్యమిస్తున్న విషయంలో తెలిసిందే. దానిలో భాగంగానే ఉద్యమసెగ దేశ రాజధానికి తాకాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.