ఏపీలో కరువు బంద్

SMTV Desk 2018-12-26 19:00:24  Andhrapradesh, Floods areas, CPI, Ramakrishna, Modi go back

విజయవాడ, డిసెంబర్ 26: నగరంలో ఇవాళ తొమ్మిది వామపక్ష పార్టీల కార్యాచరణ సమావేశం జరిగింది. ఈకార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపిలో తుఫాను కారణంగా ప్రజలు కరువుతో అల్లాడుతున్నారని ప్రభుత్వం కరువు ప్రాంతాల వారికి సాయం ప్రకటించలేదని మండిపాడ్డారు.

అలాగే ఈ నెల 28న కరువు బంద్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ఏపికి వస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియ చేస్తామని ఆయన అన్నారు. జనవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా, 6న గుంటూరులో మోదీ గో బాక్ అంటూ నినాదాలతో నిరసన తెలియచేస్తామన్నారు.