హైదరాబాద్, జూలై 27 : గంజాయి అమ్ముతుండగా ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రామకృష్ణ పురంలో నివాసముంటున్న దీపక్ (36), మురళి (21) అనే ఇద్దరు స్నేహితులు గత కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. దీంతో పోలీసులు బుధవారం రోజున నేరెడ్ పల్లి చౌరస్తాలో దీపక్, మురళి అనే ఇద్దరు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.