కర్నూల్, డిసెంబర్ 26: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీనియర్ ఎన్టీఅర్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఅర్ . ఈ చిత్రంలోని మొదటి పాట విడుదల అయ్యి ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిన విషయమే. ఆర్జీవి పై తెదేపా నేతలు పీకల్లోతు కోపంతో వున్నారు. కర్నూలు ఎమ్మెల్యె ఎస్వీ మోహన్రెడ్డి మాత్రం ఏకంగా పోలీసులకి ఫిర్యాదులు కూడా చేశారు. అయితే దీనికి ఆర్జీవి ఊహించని విధంగా స్పందించాడు.
ఎమ్మెల్యె ఎస్వీ మోహన్రెడ్డికి తన న్యాయవాది ప్రభాకర్ శ్రీపాద ద్వారా లీగల్ నోటిసులు పంపించానని తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
I sent a legal notice through my advocate Mr.S Prabhakar to Mr.S V Mohan Reddy Kurnool MLA in the context of Andhra Pradesh Chief Minister Mr.N Chandra Babu Naidu and #LakshmisNTR Here’s a draft copy https://t.co/eTWHsMBBgj
— Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2018